Saturday, April 27, 2024

TS: పోచారంలో సీతారామచంద్ర స్వామి విగ్రహ ప్రతిష్ట

బాన్సువాడ సాంస్కృతికం, సెప్టెంబర్ 9,(ప్రభా న్యూస్) : బాన్సువాడ మండలం పోచారం గ్రామంలో సీతారామచంద్ర స్వామి ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ జరుగుతుంది. ఈ కార్యక్రమానికి కామారెడ్డి వెంకట్ దాస్ ప్రభూజి, సదాశివపేట శివానంద ప్రభూజి రావడం జరిగింది. వారు పోచారం రామాలయంలో ప్రవచనం, రామ నామస్మరణ చేయడం జరిగింది. తదుపరి సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డితో బాన్సువాడ పట్టణంలో ఇస్కాన్ వారి ఆధ్వర్యంలో శ్రీకృష్ణ ఆలయం నిర్మాణ స్థలం కోసం వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో గురు వినయ్, మామిళ్ల నాగరాజు, శ్రీకృష్ణ భక్త బృందం పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement