Friday, May 3, 2024

TS: భారత వాణిజ్య కమిషనర్ గా వినయ్ రెడ్డి…

బిక్కనూర్, సెప్టెంబర్ 9 (ప్రభ న్యూస్) : పలు దేశాలకు భారత వాణిజ్య కమిషనర్ గా డాక్టర్ వినయ్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు శనివారం ఆయనకు నియామక ఉత్తర్వులను కేంద్ర ప్రభుత్వం అందజేసింది. న్యూఢిల్లీలో జరుగుతున్న జీ20 సదస్సులో ఆయనను ప్రధాని నరేంద్ర మోడీ నియమించారు. కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలానికి చెందిన సరికొండ భూమిరెడ్డి కుమారుడు వినయ్ రెడ్డి న్యూఢిల్లీలో పలు హోదాల్లో కొనసాగుతున్నారు. అక్కడ జరుగుతున్న జీ20 సదస్సులో ఆయన పాల్గొన్నారు.

ఆయన అందిస్తున్న సేవలను కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. ఈ మేరకు బ్రెజిల్, లాటిన్, అమెరికన్ కరేబియన్, దేశాలకు భారత వాణిజ్య కమిషనర్ గా నియమించారు. భారతదేశం నుండి ఆయా దేశాలకు 20రకాల వస్తువులు ఎగుమతులు, దిగుమతులపై పూర్తి అధికారం ఆయనకు ఉంటుందని పేర్కొన్నారు. భారత వాణిజ్య కమిషనర్ గా డాక్టర్ వినయ్ రెడ్డి నియమితులు కావడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement