Monday, April 29, 2024

MDK: అనుమానాస్పద స్థితిలో ఒంటరి మహిళ మృతి..

అనుమానాస్పద స్థితిలో ఒంటరి మహిళ మృతిచెందిన సంఘటన మెదక్ జిల్లాలోని మండల కేంద్రమైన మాసాయిపేటలోని ఎరుకలవాడలో శుక్రవారం చోటుచేసుకుంది. మృతురాలు పొట్టోళ్ల నాగమణి (38) అనుమానాస్పదంగా తన ఇంట్లో మృతి చెందింది. శరీరంపై గాయాలు ఉండడంతో పాటు లో దుస్తులు మాత్రమే ఉన్నాయి. నాగమణి భర్త గతంలో మరణించగా, కూతురు నాగమ్మ ఉంది. మాసాయిపేట గ్రామానికి చెందిన యువకునికి ఇచ్చి నాగమ్మ పెళ్లి చేసింది.

కాగా నాగమణి చిన్న శంకరంపేట్ మండలం శాలిపేట గ్రామానికి చెందిన బ్యాగరి రాములు అనే వ్యక్తితో సహా జీవనం చేస్తుంది. ప్రస్తుతం బ్యాగరి రాములు పరారీలో ఉన్నాడు. గ్రామస్తుల ద్వారా సమాచారం తెలుసుకున్న రామాయంపేట సిఐ లక్ష్మీబాబు, చేగుంట ఎస్సై హరీష్ సంఘటనా స్థలాన్ని సందర్శించి పరిశీలించారు. అనుమానాస్పద మృతిగా భావిస్తున్నారు. నాగమణి కూతురు నాగమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లుగా ఎస్సై హరీష్ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement