Friday, May 3, 2024

జిల్లా అదనపు కలెక్టర్ శ్యాం ప్రసాద్ చేతుల మీదుగా లఘు చిత్రం రిలీజ్

కరీంనగర్ – విక్కీ మీడియా బ్యానర్ పై సీనియర్ జర్నలిస్ట్ అయిలు రమేష్ దర్శకత్వంలో లోహిత్ వెంకట్ నిర్మించిన “నా కొడుకు ఎక్కడున్నా రాజే “చిత్రాన్ని కరీంనగర్ జిల్లా అదనపు కలెక్టర్ శ్యాం ప్రసాద్ లాల్ సోమవారం నాడు కరీంనగర్ ప్రతిభవన్ లో రిలీజ్ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజానికి ఉపయోగపడే ఎన్నో చిత్రాలను జర్నలిస్టు అయిలు రమేష్ రూపొందిస్తున్నాడని భవిష్యత్తులో దర్శకునిగా పెద్ద సినిమాల స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నాను అన్నారు.

ఈ కార్యక్రమంలో సినీ విమర్శకులు వారాల ఆనంద్ సినీ దర్శకులు అయిలు రమేష్, హీరో ఆశిష్ మున్ననూరు, రజిత , జూనియర్ హీరో లోహిత్ వెంకట్, ఆసంపల్లి శ్రీనివాస్ , నడిమెట్ల గణేష్ ,డాక్టర్ శివరాం ,గద్దె ఉదయ్ కుమార్ , శీలం శ్రీనివాసరావు , శ్రీనివాస్ యాదవ్ ,కీసర వెంకటస్వామి , కంకటి సురేష్, కార్తీక్ , గద్దల కొండ శివ , కనకా రెడ్డి ,అంజలి , సివిఎం విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

ఈ చిత్రంలో కిషోర్ దూలూరి, రజిత,ఆశిష్ మున్ననూరు, నిహారిక , లోహిత్ వెంకట్ , ఉదయ్ కుమార్ , వరుణి, నిఖిల్ చిట్ల, నిహాల్ శీలం , అభిషేక్, మర్రి రాజు యాదవ్ ,సాయి విక్కీ, , శ్రీనివాస ఆసంపల్లి, శ్రీనివాస్ యాదవ్, శీలం శ్రీనివాస్ రావు, శ్రీనివాస్ గౌడ్, డాక్టర్ శివరాం, డాక్టర్ రత్నం, కీసర వెంకటస్వామి, కంకటి సురేష్, అలేఖ్య, వివేక్, గౌతం, కార్తీక్, అనిత, పామ్ రాజు రామారావు తదితరులు నటిస్తున్నారు.
చిత్రానికి కెమెరా: శివ బత్తుల, మేకప్: అశోక్ శ్రీరామోజు , రచనా సహకారం: రాఘవ,
అసిస్టెంట్ డైరెక్టర్ :శీలం శ్రీనివాసరావు, నిర్మాత: లోహిత్ వెంకట్, కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: అయిలు రమేష్

Advertisement

తాజా వార్తలు

Advertisement