Monday, May 6, 2024

కన్నుమూసిన శివ స్వస్థిక్

వరంగల్: ప్రముఖ జానపద గాయకుడు దివంగత కునమల్ల శంకర్ రావు- సంధ్యా రాణి కొడుకు శివ స్వస్తిక్ ఎంజీఎంలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచాడు. అతడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడంటూ పలు పత్రికల్లో కథనాలు వచ్చాయి. దీంతో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ ఎంజీఎం వెళ్లి అతడి ఆరోగ్య పరిస్థితి పై ఆరా తీశారు. మెరుగైన చికిత్స అందించాలని, హైదరాబాద్ తరలించాలని ఆదేశించారు. అయితే, అంతలో పరిస్థితి విషమించి బుధవారం తెల్లవారుజామున 5.30 సమయంలో కన్నుమూశాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement