Monday, April 29, 2024

‘రైతు ఆవేదన యాత్ర’: రైతు కుటుంబానికి షర్మిల పరామర్శ

వైఎస్సార్ తెలంగాణ‌ పార్టీ అధ్యక్షురాలు ష‌ర్మిల చేపట్టిన ‘రైతు ఆవేద‌న యాత్ర’ రెండో రోజుకు చేరింది. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని అద్లూర్ ఎల్లారెడ్డి గ్రామంలో వడ్లు కొనకపోవడంతో ఆత్మహత్య చేసుకున్న రైతు మున్నారు యాదయ్య కుటుంబాన్ని ప‌రామ‌ర్శించారు. ఈ రైతు మరణానికి ప్రభుత్వమే కారణమ‌ని ఆమె ఆరోపించారు. ఓ వైపు రైతులను చంపుకుంటూ, మరోవైపు ధర్నాలు చేయడం సిగ్గు చేటని షర్మిల విమర్శించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement