Saturday, May 4, 2024

ప్రజలకు మెరుగైన సేవలందిస్తున్నాం.. సిపి రెమా రాజేశ్వరి

రామగుండం కమిషనరేట్ పరిధిలోని ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్నామని పోలీసు కమిషనర్ రెమా రాజేశ్వరి తెలియజేశారు. పెద్దపల్లిలో ఆధునికరించిన డీసీపీ కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ… కమిషనరేట్ పరిధిలోని ప్రజల సమస్యల పరిష్కారానికి తక్షణమే స్పందిస్తున్నామన్నారు. శాంతి భద్రతల పరిరక్షణ తమ ధ్యేయమని, 24 గంటలపాటు పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి డీసీపీ వైభవ్ గైక్వాడ్, ఏసీపీలు మహేష్, గిరిప్రసాద్, సిఐలు అనిల్ కుమార్ జగదీష్, సత్యనారాయణ, ప్రమోద్, సతీష్, ప్రసాద్ లతో పాటు పలువురు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement