Friday, May 3, 2024

21, 22 తేదీల్లో వ్యవసాయ కోర్సుల్లో ప్రవేశాలకు రెండో విడత కౌన్సిలింగ్‌

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : వ్యవసాయ డిప్లమా కోర్సుల్లో ప్రవేశాలకు ఈ నెల 21 , 22 తేదీల్లో రెండో విడత కౌన్సిలింగ్‌ నిర్వహించనున్నట్లు ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవయసాయ విశ్వ విద్యాలయం తెలిపింది. విద్యా సంవత్సరం 2023-24కుగాను రెండేళ్ల వ్యవసాయ, సేంద్రీయ డిప్లమా కోర్సుతోపాటు మూడేళ్ల డిప్లమా ఇన్‌ అగ్రికల్చర్‌ ఇంజనీరింగ్‌ కోర్సులో ప్రవేశాలకు కౌన్సిలింగ్‌ జరుగుతుందని యూనివర్సిటీ రిజిస్ట్రార్‌ ఎం.

వెంకటరమణ తెలిపారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. యూనివర్సిటీలోని ఆడిటోరియంలో కౌన్సిలింగ్‌ ప్రక్రియ కొనసాగుతుందన్నారు. సీట్ల కేటాయింపును పాలిసెట్‌-2023 ర్యాంకులు, రిజర్వేషన్‌ నిబంధనల మేరకు భర్తీ చేస్తామన్నారు. కౌన్సిలింగ్‌ షెడ్యూల్‌, కౌన్సిలింగ్‌కు అభ్యర్థులు సర్టిఫికెట్లతో రావాలన్నారు., కోర్సుల ఫీజు, తీసుకురావాల్సిన సర్టిఫికెట్లు తదితరాల వివరాల కోసం యూనివర్సిటీ వెబ్‌సైట్‌ను సంప్రదించాలన్నారు. షెడ్యూల్‌ను చూసి విద్యార్థులు కౌన్సిలింగ్‌కు హాజరుకావాలని సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement