Friday, May 3, 2024

Big Breaking | స్కోడా కారులో 148 కిలోల గంజాయి.. హైలెవల్​లో స్మగ్లింగ్​!

హైదరాబాద్​లో గంజాయి ముఠా చెలరేగొపోతోంది. గుట్టు చప్పుడు కాకుండా విక్రయాలు చేపడుతోంది. పబ్బులు, రిసార్టుల్లో దందా చేస్తూ యువతను టార్గెట్​ చేసుకుంటోంది. మాదాపూర్​లో ఇవ్వాల (బుధవారం) రాత్రి పోలీసులు తనికీ చేస్తుండగా ఓ గంజాయి ముఠా అడ్డంగా బుక్కయ్యింది.  స్కోడా కారులో తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. కారులో 148 కిలోల మేలు రకం గంజాయిని తరలిస్తుండగా పట్టుకున్నట్టు పోలీసులు తెలిపారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి ముగ్గురిని అరెస్టు చేశారు. నిందితుల్లో విశాఖకు చెందిన ఇద్దరు పాత నేరస్తులున్నట్టు సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement