Sunday, May 5, 2024

31 నుంచి పీజీఈసెట్‌ కౌన్సిలింగ్‌

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: ఎంఈ, ఎంటెక్‌, ఎం.ఆర్క్‌, ఎం.ఫార్మ్‌, ఫార్మ్‌ డి కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన టీఎస్‌పీజీఈసెట్‌ కౌన్సెలింగ్‌ ఈనెల 31 నుంచి నిర్వహించనున్నారు. మాసాబ్‌ట్యాంక్‌లోని తెలంగాణ ఉన్నత విద్యామండలి కార్యాలయంలో బుధవారం జరిగిన సమావేశంలో ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ప్రొ.ఆర్‌.లింబాద్రి, వైస్‌ ఛైర్మన్లు వి.వెంకట రమణ, ఎస్‌.కె.మహమూద్‌, కార్యదర్శి డా.ఎన్‌.శ్రీనివాస్‌రావు, కన్వీనర్‌ పి.రమేష్‌ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కౌన్సిలింగ్‌ షెడ్యూల్‌ను ఖరారు చేశారు.

ఈనెల 28న కౌన్సిలింగ్‌ షెడ్యూల్‌కు నోటిఫికేషన్‌ వెలువడగా, 31 నుంచి మొదటి విడత కౌన్సెలింగ్‌కు రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఆగస్టు 21వ తేదీ నుంచి 23 వరకు వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకునేందుకు అవకాశం కల్పించారు. అదే నెల 26న మొదటి విడత సీట్లను కేటాయించనున్నట్లు అధికారులు తెలిపారు. సెప్టెంబర్‌ 4 నుంచి రెండో విడత కౌన్సెలింగ్‌ ప్రారంభం కానుంది. సెప్టెంబర్‌ 16న రెండో విడత సీట్ల కేటాయింపు, 19 నుంచి తరగతులు ప్రారంభమవుతాయని అధికారులు పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement