Wednesday, May 1, 2024

సేవ్ వ‌న‌ప‌ర్తి ఆత్మ‌గౌర‌వ స‌భ‌.. హాజ‌రుకానున్న పొంగులేటి ..జూప‌ల్లి

సేవ్ వ‌న‌ప‌ర్తి పేరుతో ఆత్మ‌గౌర‌వ స‌భ‌ని నిర్వ‌హించ‌నున్నారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎంపి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు… హాజరుకానున్నారు. బీ ఆర్ ఎస్ కు గుడ్ బై చెప్పిన జిల్లా పరిషత్ చైర్మన్ లోక్ నాథ్ రెడ్డి వనపర్తి యంపిపి కిచ్చారెడ్డి పెద్ద మందడి ఎంపిపీ మెగా రెడ్డి ఆధ్వర్యంలో ఈ సభ జరుగనుంది. అవినీతి, అన్యాయాలను ఎదిరించి వనపర్తిని రక్షించుకోవాలనే నినాదంతో ఈ సభ నిర్వహిస్తున్నారు. ఇక ఈ వనపర్తి సభ తో పొంగులేటి, జూపల్లి భవిష్యత్ పై క్లారిటీ రానుందని సమాచారం అందుతోంది. మరి ఇవాళ మాజీ ఎంపి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఎలాంటి ప్రకటన చేస్తారో చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement