Wednesday, May 15, 2024

HYD : ప్రజల చూపు కాంగ్రెస్ వైపు….. కాంగ్రెస్ అభ్యర్థి మధుయాష్కీ సతీమణి రుచి

ఎల్బీనగర్, నవంబర్ 26(ప్రభ న్యూస్)
తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షలను హరించిన బీఆర్ఎస్ ను గద్దె దింపుదాం అని ఎల్బీనగర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మధుయాష్కి గౌడ్ సతీమణి రుచి యాష్కి గౌడ్ అన్నారు. బి.యన్ రెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని పలు కాలనీలలో మధుయాష్కి గౌడ్ ని గెలిపించాలని కాంగ్రెస్ కార్యకర్తలతో కలసి ఉదయం పాదయాత్ర ద్వారా ఇంటింటా ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా ప్రజలు బీఆర్ఎస్ ప్రభుత్వం తీరును ఎండగడుతూ మండిపడ్డారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీగా ఈసారి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మధు యాష్కీ కి మద్దతుగా నిలుస్తామని హామీ ఇచ్చారు. అనంతరం రుచి యాష్కి గౌడ్ మాట్లాడుతూ బీఆర్ఎస్ అవినీతి పాలనపై అసంతృప్తిలో ఉన్న ప్రజలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారని అన్నారు. ఇంటింటి ప్రచారంలో ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని కాంగ్రెస్ గెలుపు ఖాయమని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలకు పై కూడా ప్రజలు విశ్వాసంపై ఉన్నారని వివరించారు. ఈ ప్రచార కార్యక్రమంలో ప్రశాంత్ గౌడ్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement