Thursday, May 2, 2024

ఆర్టీసీ బస్సును ఢీ కొట్టిన డీసీఎం వ్యాన్

పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని మంథని రైల్వే ఓవర్ బ్రిడ్జి వద్ద రాజీవ్ రహదారి పై ప్రయాణిస్తున్న మంచిర్యాల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ను పెద్ద‌ప‌ల్లి శివారులో డిసిఎం వ్యాన్ ఢీ కొట్టింది.దీంతో బస్సు ఒక భాగం పూర్తిగా ధ్వంసమైంది. ఎదురుగా వస్తున్న డీసీఎం వ్యాన్ బ్రేకులు ఫెయిల్ కావడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని వ్యాన్ డ్రైవర్ తెలిపాడు. ప్రమాదం జరిగిన సమయంలో ఆర్టీసీ బస్సులో 24 మంది ఉన్నట్లు బస్సు కండక్టర్ తెలిపాడు. ఈ ప్రమాదంలో ప్రయాణికులు సురక్షితంగా బయటపడడంతో ఊపిరి పీల్చుకున్నారు. ప్ర‌మాదం జ‌రిగే స‌మాయానికి బ‌స్సు క‌రీంన‌గ‌ర్ వెళుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement