Tuesday, May 21, 2024

Breaking : ఘోర రోడ్డు ప్రమాదం…ఇద్దరు మృతి

పెద్దపెల్లి జిల్లా మంథని మండలం బిట్టు పల్లి గ్రామంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బిట్టు పల్లి గ్రామానికి చెందిన ఇద్దరు నడుచుకుంటూ రోడ్డుపై వెళ్తుండగా .. లారీ ఢీకొట్టడంతో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా ,మరొకరు మంథని ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందారు.మృతి చెందినవారిలో బిట్టు పల్లి గ్రామానికి చెందిన చిలువేరు గట్టయ్య, ధర్మ రాజమల్లు గా గుర్తించారు. మంథని సీఐ సతీష్, ఎస్ఐ చంద్ర కుమార్ లు సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement