Tuesday, April 30, 2024

అభివృద్ధి పనులు వేగంగా పూర్తి చేయించాల‌ని ఎమ్మెల్యేకు విన‌తి

కుత్బుల్లాపూర్ : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, చింతల్ 128 డివిజన్ పరిధిలోని భగత్ సింగ్ నగర్ లో పెండింగ్ లో ఉన్న పనులను వెంటనే పూర్తి చేయించేలా చర్యలు తీసుకోవాలని బస్తీ వాసులు ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ ను కోరారు. భగత్ సింగ్ నగర్ వాసులు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గౌడ్ ను తన నివాసం వద్ద మర్యాద పూర్వకంగా కలిశారు. అనంతరం బస్తీల్లో చేపడుతున్న భూగర్భ డ్రైనేజీ పనులు వేగంగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ కు వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ… కాలనీ వాసులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా డ్రైనేజీ పనులు వేగంగా పూర్తి చేయిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కే.సాంబయ్య, జి.ప్రభాకర్, సామ్రాట్, చందు, రాజు, మల్లేష్, పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement