Monday, April 29, 2024

మున్సిపల్ చైర్మన్ కృషితో వైసీపీ అభ్యర్థి గెలుపు

నందికొట్కూరు మున్సిపాలిటీలో 10వ వార్డుకు జరిగిన ఉప ఎన్నికల్లో చైర్మన్ దాసి సుధాకర్ రెడ్డి కృషి ఫలించింది. బుధవారం ఉదయం నుండి 10వ వార్డ్ ఉపఎన్నికల ఓట్లను ఎన్నికల అధికారులు లెక్కించారు. వైసీపీ అభ్యర్థి వీరబొమ్మ రూపాదేవి టీడీపీ అభ్యర్థి పై 234 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో వీరబొమ్మ రూపా దేవిని రాష్ట్ర క్రీడాప్రాధికార సంస్థ చైర్మన్ బైరెడ్డి సిద్దార్థరెడ్డి బలపరిచారు. 10వ వార్డులు 987 మంది ఓటర్లు ఉండగా 780 ఓట్లు పాలయ్యాయి. టీడీపీ అభ్యర్థిని గుంపు ప్రభావతికి 260 ఓట్లు, వీరబొమ్మ రూపా దేవికి 494, స్వతంత్ర అభ్యర్ధులు ముగ్గురికి కలిపి 2,3,5 ఓట్లు నమోదయ్యాయి. వైసీపీ అభ్యర్థి రూపా దేవి 234ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. గెలుపుకు మున్సిపాలిటీ ఛైర్మన్ దాసి సుధాకర్ రెడ్డి, ఆయనతో పాటు కౌన్సిలర్లు, వైసీపీ నేతలు వారం రోజుల పాటు అహర్నిశలు కృషి చేసి ప్రచారం చేశారు. ఈమె గెలుపుతో పట్టణంలో చైర్మన్ ను, వీరబొమ్మ రూపాదేవిని మేళా తాలలతో సంబరాలు జరుపుకుంటున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

https://www.facebook.com/andhraprabhanewsdaily

https://twitter.com/AndhraPrabhaApp,

Advertisement

తాజా వార్తలు

Advertisement