Thursday, May 2, 2024

17వ రోజుకి చేరిన మ‌హాపాద‌యాత్ర‌..

న్యాయస్థానం నుంచి దేవ‌స్థానం పేరుతో రాజ‌ధాని రైతులు చేప‌ట్టిన మ‌హా పాద‌యాత్ర 17వ రోజుకి చేరుకుంది. ప్రకాశం జిల్లా కందుకూరులోని వెంగమాంబ కల్యాణ మండపం నుంచి ప్రారంభమైన యాత్ర 16 కిలోమీటర్ల పాటు సాగనుంది. మధ్యాహ్నం మోపాడులో రైతులు భోజనం చేస్తారు. రాత్రికి ప్రకాశం జిల్లా గుడ్లూరులో రైతులు బస చేస్తారు. మొత్తం 45 రోజులపాటు సాగనున్న ఈ పాదయాత్ర గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లోని 70 ప్రధాన గ్రామాల మీదుగా సాగుతుంది. డిసెంబరు 15న తిరుపతికి చేరుకోవడంతో పాదయాత్ర ముగుస్తుంది.రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ ఈ యాత్ర‌ని ప్రారంభించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement