Thursday, May 2, 2024

టీఎస్ ఆర్టీసీలో గణతంత్ర వేడుకలు : కొత్త వెబ్ సైట్ ప్రారంభం

తెలంగాణ‌ బస్ భవన్ లో ఈరోజు జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘ‌నంగా జ‌రిగాయి. టీఎస్ ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ (ఎమ్మెల్యే), ఎండీ వీసీ సజ్జనార్ (ఐ.పి.యస్) త్రివర్ణ పతాకాన్ని ఎగుర వేసిన అనంతరం అధికారులకు, సూపర్ వైజర్లకు, ఉద్యోగులందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా బాజిరెడ్డి గోవర్ధన్ టీఎస్ ఆర్టీసీ కొత్త వెబ్ సైట్ ను ప్రారంభించారు. ఈసంద‌ర్భంగా వారు మాట్లాడుతూ… ఇది చాలా యూజర్ ఫ్రెండ్లీ, సామాన్య ప్రజలు దీన్ని సులభంగా ఉపయోగించుకోవచ్చన్నారు. పాత వెబ్ సైట్ ను పూర్తిగా మార్చి తాజా సమాచారంతో నవీకరించి పునరుద్ధరించారన్నారు. ఈ కొత్త పునరుద్ధరించబడిన వెబ్ సైట్ ను సందర్శించి, సంస్థ అభివృద్ధికి తమ విలువైన అభిప్రాయాలను, సూచనలను పంపవలసిందిగా ప్రజలకు టీఎస్ ఆర్టీసీ యాజమాన్యం విజ్ఞప్తి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (రెవెన్యూ అండ్ సంస్థ కార్యదర్శి ) ఏ పురుషోత్తం, ఇతర ఉన్నతాధికారులు అన్ని కోవిడ్ నిబంధనలను అనుసరించి పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement