Sunday, April 28, 2024

Car terror: మాజీ ఎమ్మెల్యే కుమారుడి రాష్ డ్రైవింగ్‌.. కేసు న‌మోదు చేసిన పోలీసులు

ప్రజాభవన్ వద్ద బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు తన కారుతో బీభత్సం సృష్టించాడు. డిసెంబర్ 23 తెల్లవారుజామున మూడు గంటల సమయంలో ప్రజాభవన్ భారికేడ్లను తన కారుతో ఢీకొట్టాడు. దీంతో భారికేడ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. కారు ప్రమాదానికి గురైన వెంటనే సోహెల్ అక్కడి నుంచి పారిపోయారు.

కేసు తప్పుదోవ పట్టించేందుకు వేరే వ్యక్తి కారు డ్రైవ్ చేసినట్లు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీనిపై వెస్ట్ జోన్ డిసిపి విజయ్ కుమార్ మాట్లాడుతూ.. ప్రస్తుతం రాహెల్ పరారీ లో ఉన్నాడు..మిగతా వారిని అదుపులోకి తీసుకున్నామన్నారు. రాహెల్ ఇంట్లో పనిచేసే డ్రైవర్ తానే డ్రైవ్ చేసినట్లుగా పోలీస్ స్టేషన్ వద్దకు వచ్చి లొంగిపోయాడని తెలిపారు. ర్యాష్ డ్రైవింగ్ కేసులో దర్యాప్తును వేగవంతం చేశామని, ఈ కేసులో ఎవరున్నా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. న్యూ ఇయర్ కోసం ఏర్పాటు చేసినటువంటి బ్యారికేట్స్ ను అతివేగంగా వచ్చి బిఎమ్ డబ్ల్యూ కారు ఢీ కొట్టింద‌ని, కారులో ఇద్దరు యువకులతో పాటు ఇద్దరు యువతులు ఉన్నారని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement