Sunday, April 28, 2024

TS: రేపు వికారాబాద్ జిల్లాలోకి విజ‌య సంక‌ల్ప‌యాత్ర.. కొండా విశ్వేశ్వ‌ర‌రెడ్డి

వికారాబాద్, ఫిబ్రవరి 19 (ప్రభ న్యూస్): విజయ సంకల్ప యాత్రలో భాగంగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ మంగళవారం వికారాబాద్ జిల్లాకు విచ్చేస్తున్నట్టు చేవెళ్ల మాజీ ఎంపీ, బీజేపీ నాయకులు కొండా విశ్వేశ్వరరెడ్డి తెలిపారు. సోమవారం వికారాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు మాధురితో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడుతూ… మూడు రోజులపాటు ఈ విజయసంకల్పయాత్ర కొనసాగుతుందని తెలిపారు.

మంగళవారం తాండూర్, వికారాబాద్ లో ఈ యాత్ర‌ కొనసాగుతుందని, ముగింపు రోజున శేరిలింగంప‌ల్లిలో బహిరంగ సభ నిర్వహిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శివరాజ్, నాయకులు కేపీ రాజు, వివేకానంద రెడ్డి, విజయభాస్కర్ రెడ్డి, నరోత్తం రెడ్డి, విజయరాజ్, శ్రీరాములు, బసవలింగం, గోవర్ధన్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement