Sunday, May 5, 2024

అప్పుల బాధ భరించలేక.. వ్యక్తి ఆత్మహత్య

శంకర్పల్లి (ఆంధ్రప్రభ) : మున్సిపాలిటీ కేంద్రంలో అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు..ఈ మేర‌కు శంకర్పల్లి పోలీసులు వివరాలు తెలిపారు.. కనిగంటి శ్రీనివాస్ అనే వ్యక్తి మేస్త్రి పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు ..ఆయ‌న వయసు 45 సంవత్సరాలు..ఆయనకు భార్య ..ఇద్దరు పిల్లలు ఉన్నారు అప్పుల బాధ భరించలేక శుక్రవారం తెల్లవారుజామున దాదాపు 5 గంటల సమయాన ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement