Thursday, May 16, 2024

రోడ్డు ప్ర‌మాదంలో ఇద్ద‌రికి గాయాలు

రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని తొండుపల్లి బెంగళూరు జాతీయ రహదారిపై శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్‌పై వస్తున్న ఇద్దరు యువకులను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. షాద్‌నగర్ వైపు నుండి వస్తున్న లారీ రోడ్డు క్రాస్ చేస్తున్న బైక్‌ను బలంగా ఢీకొట్టింది. దీంతో బైక్‌పై నుండి ఎగిరిపడ్డ యువకులు తీవ్రంగా గాయపడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను 108 వాహనంలో హాస్పిటల్‌కు తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement