Saturday, May 18, 2024

మునుగోడు ప్రజాదీవెన సభకు బయలుదేరిన సీఎం కేసీఆర్‌

మునుగోడు ప్రజాదీవెన సభకు సీఎం కేసీఆర్‌ బయలుదేరారు. సీఎం కేసీఆర్‌తోపాటు మంత్రులు, నాయకులు పెద్దసంఖ్యలో తరలివెళ్తున్నారు. హైదరాబాద్‌ నుంచి మునుగోడు వరకు ఐదువేలకు పైగా కార్లలో భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. ప్రగతి భవన్‌ నుంచి బస్సులో బయలుదేరిన సీఎం కేసీఆర్‌కు.. ఉప్పల్‌ చౌరస్తాలో పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. టీఆర్‌ఎస్‌ ప్రజాదీవెన సభకు సర్వం సిద్ధమైంది. సభావేదికతోపాటు మునుగోడు మొత్తం గులాబీమయమైంది. ఇప్పటికే భారీ సంఖ్యలో టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు సభాస్థలికి చేరుకుంటున్నారు. సుమారు లక్షన్నర మంది కూర్చునేలా 25 ఎకరాల్లో సభా ఏర్పాట్లు పూర్తిచేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement