Sunday, May 5, 2024

టీఆర్ఎస్ ప్రభుత్వంతోనే ఆభివృది… మంత్రి మల్లారెడ్డి

కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఇత‌ర పార్టీల వారు టీఆర్ఎస్ లో చేరుతున్నార‌ని, కేవలం టీఆర్ఎస్ పార్టీతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని రాష్ట కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి పేర్కొన్నారు. మేడ్చల్ నియోజకవర్గం కీసర మండలం భోగరం గ్రామానికి చెందిన దాదాపు 30మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, మహిళలు, యువకులు, భారీ ఎత్తున టీఆర్ఎస్ పార్టీలో చేరారు. బోయినపల్లి క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో వారందరికీ గులాబీ కండువావేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ వెంకటేష్, మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సుధాకర్ రెడ్డి, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement