Sunday, May 5, 2024

RR: షాద్ నగర్ లో ఇద్దరు సబ్ రిజిస్ట్రార్ ల బదిలీలు

షాద్ నగర్, ఆగస్టు 23, ప్రభ న్యూస్ : రంగారెడ్డి జిల్లా షాద్ నగర్, ఫరూక్ నగర్ ప్రాంతాలకు చెందిన ఇద్దరు సబ్ రిజిస్ట్రార్ లు బదిలీ అయ్యారు. ఫరూక్ నగర్ సబ్ రిజిస్ట్రార్ గా ఆరు సంవత్సరాలకు పైగా సేవలు అందించిన సతీష్ కుమార్ ను బదిలీ చేస్తూ చిక్కడపల్లికి స్థాన చలనం కల్పించారు. అదేవిధంగా షాద్ నగర్ సబ్ రిజిస్ట్రార్ జె.సురేందర్ ను ఉప్పల్ కు బదిలీ చేశారు.

సతీష్ కుమార్ ఆరు సంవత్సరాల మూడు నెలల పాటు ఇక్కడ సుదీర్ఘకాలంగా సేవలు అందించారు. విధి నిర్వహణ పరంగా ఆయన నిక్కచ్చిగా వ్యవహరించారు. ముక్కుసూటి తనంతో వ్యవహరించి ఆయన పలువురు మన్ననలు పొందారు. వీరి స్థానంలో ఫరూక్ నగర్ నూతన సబ్ రిజిస్ట్రార్ గా సయ్యద్ సాదత్ అలీ వచ్చారు. అదేవిధంగా షాద్ నగర్ కు శేషాద్రి చంద్ బదిలీపై వచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement