Thursday, May 16, 2024

VKB | మొండికుంటలో చిక్కుకుపోయిన ట్రాక్ట‌ర్‌.. బాధితులను కాపాడిన గ్రామ‌స్తులు

ధారూర్, (ప్రభ న్యూస్): వికారాబాద్​ జిల్లాలో వాగులు వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ధారుర్‌కు ట్రాక్టర్​ మీద వస్తుండగా మొండికుంట వాగులో కొంత‌మంది చిక్కుకుపోయారు. ఈ ఘటన ఇవ్వాల (శుక్రవారం) ధారూర్​ మండలంలో జరిగింది. వాగులో చిక్కుకున్న అంపల్లి వాసులను ఎస్టీ సెల్ నాయకుడు దేవేందర్, గ్రామస్తులతో కలిసి కాపాడారు.

అంపల్లి గ్రామానికి చెందిన తార్యా నాయక్ కుమారుడు సొరకాయ నాయక్ , లచ్చ నాయక్, అంజి బాయి, యాదయ్య.. వీరంతా ట్రాక్టర్ లొ మైలారం చింతకుంట గ్రామాల మీదుగా ధారూర్ మండల కేంద్రానికి వస్తున్నారు. మైలారం సమీపంలో మెుండికుంట వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. వారు వ‌స్తుండ‌గా వాగులో ట్రాక్టర్ చిక్కుకుపొవడంతొ పక్కనే ఉన్న మైలారం గ్రామస్తులు పొలంలో గ‌మ‌నించారు. కరిగెట ట్రాక్టర్ నడుపుతున్నారు. స్థానికులు అక్కడికి చేరుకొని బయటికి తీసి కాపాడారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement