Saturday, April 27, 2024

రియల్ ఎస్టేట్ వ్యాపారిని.. నరికి చంపిన దుండగులు

మేడ్చల్ జిల్లా : కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోరం జ‌రిగింది. నాగారం శివారు ప్రాంతమైన అర్.టి.సీ కాలనీ లో నివాసం ఉంటున్న రియల్ ఎస్టేట్ వ్యాపారి అశోక్ ..ఆయ‌న వ‌య‌సు 50సంవ‌త్స‌రాలు. అశోక్ పై తన ఇంటి వద్ద కత్తులతో దాడి చేసిన గుర్తు తెలియని నలుగురు దుండగులు , స్థానికంగా ఉన్న జనం కేకలు వేయడంతో పరారైన హంతకులు , తీవ్ర రక్త స్రావం లో పడి ఉన్న అశోక్ ను హుటాహుటిన పక్కనే ఉన్న సైన్ హాస్పటల్ కు తరలించిన కుటుంబ సభ్యులు , చికిత్స పొందుతూ మృతి చెందిన అశోక్ , సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement