Sunday, May 5, 2024

మరో ఇద్దరికి కరోనా..

తాండూర్ : మండలం అంతారం పంచాయతీ అనుబంధ గ్రామం దస్తగిరిపేట్ లో మరో ఇద్దరికి కరోనా. గత నాలుగు రోజుల క్రితమే బుడగ జంగం ఆశమ్మ కరోనాతో మృతి చెందిన విషయం తెలిసిందే తాజాగా జిల్లా పరిషత్ చైర్పర్సన్ సునీత మహేందర్ రెడ్డి తాసిల్దార్ కు ఫోన్ చేసి దస్తగిరి పేట లో కరోనా పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. ఈ విషయాన్ని తాసిల్దార్ చిన్నప్పల నాయుడు జినుగుర్తి ప్రాథమిక ఆస్పత్రి వైద్యులు అపూర్వతో మాట్లాడి ఈ దస్తగిరి పేటలో ఆసుపత్రి సిబ్బంది కరణ టెస్టులు నిర్వహించారు. ఇరవై ఎనిమిది మందికి చేయగా బుడగ జంగం వెంకటేష్ తండ్రి పోచప్పా, మరో వ్యక్తి యాలాల మండలం లక్ష్మీ నారాయణ పూర్ కు చెందిన శంకరప్ప తండ్రి బందెప్ప ఇద్దరికీ పాజిటివ్ అని తెలిసింది మరణించిన ఆశమ్మ కుమారుడితో పాటు అల్లుడికి సోకినట్లు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement