Tuesday, April 30, 2024

ట్రాక్ పై యువతి మృతదేహం

ఇచ్ఛాపురం, రైల్వే స్టేషన్ కు సుమారు 2 కి.మీ. దూరంలో ట్రాక్ పై ఇచ్చాపురం నీలాపువీధి కి చెందిన‌ ఉలాసి గాయత్రి (19 ) శవమై కనిపించింది. మృతురాలు తండ్రి ఉలాసి వాసుదేవరెడ్డి బజార్లో పూజ సామగ్రి విక్రయిస్తుoటాడు. గాయత్రి ఇంటర్ పూర్తి చేసి ఖాళీ గా ఉంటోంది. అయితే ఈమె ఎలా చనిపోయిందన్న అంశం పై స్పష్టత రావాల్సి ఉంది. పలాస రైల్వే పోలీసులు వచ్చి వివరాలు సేకరిస్తున్నారు. తల్లిదండ్రులకు కారణాలు అడ‌గ‌గా ఎవరో ఎదో చేసి ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తం చేశారు..కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేస్తున్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement