Sunday, May 19, 2024

RR: బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య తోపులాట.. చెదరగొట్టిన పోలీసులు

కేశంపేట : బుధవారం మండల కేంద్రంలో లోక్ స‌భ‌ ఎన్నికల ప్రచారానికి బీజేపీ, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు వచ్చారు. కాంగ్రెస్ అభ్యర్థి చల్లా వంశీ చంద్ రెడ్డి మీటింగ్ జరుగుతున్న సమయంలో బీజేపీ అభ్యర్థి డీకే అరుణ ర్యాలీ రావడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. పోలీసులు ఇరువర్గాలను సముదాయించి పంపారు. ఉదయం 9 గంటలకు ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రచారం రెండు గంటలు ఆలస్యం కావడంతో అదే సమయంలో బీజేపీ అభ్యర్థి డీకే అరుణ రావడంతో ఇరుపార్టీల కార్యకర్తలు మధ్య తోపులాట జరిగింది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement