Tuesday, April 30, 2024

కట్టుకున్న వాడే కడతేర్చాడు..

జిన్నారం : జిన్నారం మండలం బొల్లారంలో జంట హత్యలు పారిశ్రామిక వాడలో కలకలం రేపాయి. తల్లి..కూతుళ్లను కట్టుకున్న వాడే కడతేర్చిన సంఘటన ఇది. బొల్లారం సిపి ప్రశాంత్‌ తెలిపిన వివరాల ప్రకారం.. గుమ్మడిదల మండలంలోని అన్నారం గ్రామ పంచాయితీ కార్యాలయంలో బుడగ జంగం నరసింహా ఎలక్ట్రీషియన్‌గా పని చేస్తూ అదే గ్రామంలో నివాసం ఉంటున్నాడు. నరసింహా తన అత్తగారిలైన బొల్లారంకి వచ్చాడు. ఐడిఏ బొల్లారం గాంధీనగర్‌లో నివాసముండే తన అత్త ఎల్లమ్మ (55), భార్య స్వరూప(32) ఇద్దరు మహిళలను కత్తితో అతికిరాతకంగా పొడిచి చంపాడు. ఈ దారుణ సంఘటన తెల్లావారు జామున 4 గంటల 30 నిమిషాల నుండి 5 గంటల మధ్య జరిగింది. హత్య చేసిన అనంతరం హంతకుడు నేరుగా పోలీసుల వద్దకు వెళ్లి లొంగిపోయాడు. కేసు నమోదు చేసి హత్యకు కుటుంబ కలహాలే కారణమా లేక మరేమైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలో విచారణ చేస్తున్నట్లు సీఐ ప్రశాంత్‌ తెలిపారు. మృతదేహాలను పటాన్‌చెరు ప్రభత్వు ఆసుపత్రికి పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించినట్లు సిఐ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement