Monday, April 29, 2024

పౌర సేవా కేంద్రం పనితీరు పరిశీలన..

కుత్బుల్లాపూర్‌ : దుండిగల్‌ మున్సిపాలిటీలోని పౌర సేవా కేంద్రం పనితీరును, ఈ ఆఫీస్‌ పనితురును కమీషనర్‌ ఎంఎన్‌ఆర్‌ జ్యోతి పరిశీలించారు. ముఖ్యంగా అస్తి పన్ను చెల్లింపు విధానం పౌర సేవా కేంద్రంలో మొదలగు పద్దతుల ద్వారా చెల్లింవచ్చునని ఆమె తెలిపారు. అస్తిపన్ను మీద వచ్చే ఫిర్యాదులు స్వీకరణ, పౌర సేవా కేంద్రం, అందించబడు సేవలు వివరాలు, వాటి రిజిస్టర్స్‌ను పౌర సేవా కేంద్రం పనితీరు పరిశీలించినట్లు తెలిపారు. ఫి ర్యాదులు సిటిజెన్‌ బడ్డి యాప్‌ ద్వారా ఇంటి వద్దనే ఫిర్యాదులు చేయవచ్చునని, వాటిని మున్సిపల్‌ సిబ్బంది పరిష్కారించి మీ ఫోన్‌కు సమాచారం ఇవ్వబడుతుందని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement