Friday, May 3, 2024

స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించండి.. ఎమ్మెల్సీ శంభీపూర్ రాజుకి వినతి

కుత్బుల్లాపూర్ : మేడ్చల్ జిల్లా తెరాస పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజుని శ‌నివారం కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని వివిధ కాలనీల ప్రజలు శంభీపూర్ లోని కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. సమస్యలు పరిష్కరించాలని వినతిపత్రాలు అందజేశారు. అనంత‌రం ఎమ్మెల్సీ మాట్లాడుతూ సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ కాలనీల సంక్షేమ సంఘాల ప్రతినిధులు, తెరాస పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement