Sunday, April 28, 2024

బోరు మోటార్ ప్రారంభం..మాస్క్ ల పంపిణి..

జవహర్‌నగర్‌ ) : వేసవి కాలాన్ని దృష్టిలో పె ట్టుకోని డివిజన్‌ ప్రజల దాహార్తిని తీర్చడానికి నిరంతరం కృషి చేస్తానని జవహర్‌నగర్‌ మున్సిపల్‌ కార్పోరేషన్‌ డిప్యూటి మేయర్‌ రెడ్డిశెట్టి శ్రీనివాస్‌ అన్నారు. 21వ డివిజన్‌ ప్రోఫెసర్‌ జయశంకర్‌ కాలనీలో సఫిడ్‌ సంస్థ సౌజన్యంతో కాలనీ వాసుల దాహర్తీని తీర్చడానికి కోఆప్షన్‌ సభ్యులు భూమా విజయ పౌల్‌ ఆధ్వర్యంలో నూతనంగా వేసిన బోరు పాయింట్‌కు బోరు మోటార్‌ను బిగించారు. ఈ సందర్భంగా డిప్యూటి మేయర్‌ మాట్లాడుతూ సఫిడ్‌ సంస్థ యజమాన్యంకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. జవహర్‌నగర్‌ మున్సిపల్‌ కార్పోరేషన్‌ 28 డివిజన్లకు ఉప మేయర్‌గా కొనసాగుతున్నంత కాలం ప్రజలకు ఎల్లప్పుడు అందుబాటులో ఉండి వారి సమస్యలను పరిష్కరించేందుకు నిరంతరం కృషి చేస్తాను. రానున్న రోజుల్లో డివిజన్‌లోని సమస్యలను సత్వరమే పరిష్కరిస్తానని వారు పేర్కోన్నారు. అనంతరం సంస్థ ఆర్థిక సహాయంతో 9వ తరగతి, 10వ తరగతి విద్యార్థిని విద్యార్థులకు మాస్కులు, శానిటైజర్‌, సబ్బులను ఆయన పంపిణి చేశారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ సెల్‌ తెరాస పార్టీ సీనియర్‌ నాయకులు సాదిక్‌ , కృష్ణ యాదవ్‌, ముకుందమ్‌, రూబెన్‌, నరేష్‌, జక్కుల భాస్కర్‌, మహిళలు కావ్య, సౌందర్య, లక్ష్మీ, కాలనీ వాసులు, తదితరులు పాల్గోన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement