Wednesday, April 24, 2024

ఆవుల తరలింపుపై ఆంక్షలు..

హవేళిఘణపూర్‌ : మండలంలో పక్కనున్న కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం నుండి హైదరాబాద్‌కు ఆవులను రవాణా చేస్తుండగా బిజేపి మండల అధ్యక్షుడు రంజిత్‌రెడ్డి ఆధ్వర్యంలో హవేళిఘణపురం వద్ద ఆవులను తీసుకెళ్తున్న డీసీఎంను ఆపి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా బిజేపి మండల అధ్యక్షులు రంజిత్‌రెడ్డి మాట్లాడుతూ ఆవులను తరలించే విషయంలో ప్రభుత్వం స్పష్టమైన ఆంక్షలు విధించాలని డిమాండ్‌ చేశారు. కేంద్ర ప్రభుత్వం గోవధపై చట్టాలు తెచ్చినా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయకపోవడం శోచనీయం అన్నారు. పశు సంపద అంతరించి పోతే రాబోయే తరానికి ప్రమాదమని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు ప్రభాకర్‌, బిజేవైఎం జిల్లా అధ్యక్షులు రమాకాంత్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి సుధాకర్‌రెడ్డి, బజరంగ్‌దళ్‌ నాయకులు సతీష్‌, విద్యాసాగర్‌శర్మ, బిజేపి నాయకులు శివ, వడ్ల నవీన్‌, రాంచందర్‌, బిక్షపతినాయక్‌, వాడి బిజేపి శ్రేణులు బజరంగ్‌దళ్‌ కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement