Tuesday, May 7, 2024

ప్లీనరీని విజయవంతం చేద్దాం .. సమావేశంలో నిర్ణయం

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీ, జిల్లా తెరాస పార్టీ అధ్యక్షులు శంబిపూర్ రాజు అధ్యక్షతన జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది. ఈనెల 27న జరిగే ప్లీనరీ సమావేశాన్ని విజయవంతం చేయాలని నిర్ణయించారు. సమావేశానికి మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద, అరికేపూడి గాంధీ, భేతి సుభాష్ రెడ్డి, జడ్పీ చైర్మన్ శరత్ చంద్ర రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షులు నంద రెడ్డి, మల్కాజ్గిరి పార్లమెంట్ ఇంచార్జ్ రాజశేఖర్ రెడ్డి, పార్టీ కార్యదర్శి జహంగీర్, ఆయా సంస్థల చైర్మన్లు, వైస్ చైర్మన్లు, కార్పొరేటర్లు, నాయకులు, పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement