Friday, April 26, 2024

Breaking : యాదాద్రి స్వామికి విరాళంగా కిలో బంగారం – మంత్రి పువ్వాడ దంపతుల ప్ర‌త్యేక పూజ‌లు

యాదాద్రి : తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తన పుట్టినరోజు సందర్భంగా యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. యాదాద్రి శ్రీ లక్ష్మినరసింహ స్వామి ఆలయ విమాన గోపురం స్వర్ణ తాపడం కోసం ఖమ్మం జిల్లా ప్రజల తరుపున మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కిలో బంగారాన్ని కానుకగా అందజేశారు. వేద పండితులు, అర్చకుల నడుమ సంప్రోక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పువ్వాడకు పలువురు దేవాలయ అధికారులు ఘన స్వాగతం పలికి స్వామి వారి తీర్ధ ప్రసాదాన్ని అందజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement