Monday, May 6, 2024

RR: అవినీతిని వ్యతిరేకిద్దాం… జాతి ఉన్నతిని కాపాడుదాం…

శంకర్ పల్లి, (ప్రభ న్యూస్) : అవినీతిని వ్యతిరేకిద్ధాం… జాతి ఉన్నతిని కాపాడుదామని శంకర్ పల్లి ఇన్ స్పెక్టర్ వినాయక్ రెడ్డి అన్నారు. ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకొని జాతీయ సమైక్యత దినోత్సవం, విజిలెన్స్ వారోత్సవాల కార్యక్రమంలో భాగంగా “రన్ ఫర్ యూనిటీ” కార్యక్రమాన్ని భానూరు భారత్ డైనమిక్స్ లిమిటెడ్ ప్రొడక్షన్ మేనేజర్ రాజారాం, శంకర్ పల్లి CI వినాయక్ రెడ్డి ఆధ్వర్యంలో BDL ఉద్యోగులు, శంకర్ పల్లి బాలికల హాస్టల్ విద్యార్థులతో కలిసి మంగళవారం ఉదయం పెద్దఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో శంకర్ పల్లి ఇన్ స్పెక్టర్ వినాయక రెడ్డి మాట్లాడుతూ… సంస్థానాల విలీన ప్రక్రియలో మొండికేసిన మూడు సంస్థానాలను పోలీస్ యాక్షన్ ద్వారా భారతదేశంలో కలిపిన ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ అని అన్నారు.

భారత్ డైనమిక్స్ లిమిటెడ్ ప్రొడక్షన్ మేనేజర్ రాజారాం మాట్లాడుతూ… అవినీతిని వ్యతిరేకిద్దాం జాతిని ఐక్యం చేద్దామని ఆయన పిలుపునిచ్చారు.. జాతి ఐక్యత, సమగ్రత, భద్రతను కాపాడేందుకు సందేశాన్ని వ్యాప్తి చేయడానికి విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. విద్యార్థులు, ఉద్యోగులు శంకర్పల్లి ఎస్ హెచ్ ఓ సిబ్బంది పూర్తి సమన్వయంతో కార్యక్రమాన్ని పూర్తి చేశారు. మున్సిపల్ వైస్ చైర్మన్ వెంకటరామిరెడ్డి, కౌన్సిలర్ చంద్రమౌళి, తదితరులు ర్యాలీలో పాల్గొన్నారు. అవినీతిని అంత మొందించాలని పిలుపునిచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement