Friday, May 17, 2024

TDP: రాజమండ్రి చేరుకున్న నారా లోకేష్, బ్రాహ్మణి

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, ఆయన సతీమణి నారా బ్రాహ్మణి రాజమండ్రి చేరుకున్నారు. ఈసందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబుకు బెయిల్ వచ్చిన విషయాన్ని లోకేష్ వద్ద నాయకులు ప్రస్తావించారు.

52 రోజులుగా చంద్రబాబు నాయుడు జైలులో ఉన్న పరిస్థితుల్లో ఈ మధ్యంతర బెయిల్ పెద్ద రిలీఫ్ గా టీడీపీ శ్రేణులు భావిస్తున్నాయి. ఈసందర్భంగా లోకేష్ స్పందిస్తూ… యుద్ధం ఇప్పుడు ప్రారంభమైందని నాయకులు, కార్యకర్తలతో అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement