Friday, April 26, 2024

గ్రేవ్‌ యార్డ్‌ కాంపౌండ్‌ వాల్‌ ..

కుత్బుల్లాపూర్‌ : అభివృద్ధి, సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని కౌన్సిలర్‌ సుంకరి కృష్ణ పేర్కొన్నారు. మల్లంపేట్‌లోని ముస్లిం గ్రేవ్‌యార్డ్‌ కాంపౌండ్‌ వాల్‌ పనులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపాలటీ పరిధిలోని ప్రతివార్డులో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్‌ఒ మదాసు వెంకటేశం, కౌన్సిలర్‌ ఎ అనంతస్వామి ముదిరాజ్‌, ఎస్‌. హనుమంతరావు, ఈ.ఆంజనేయులు, మున్సిపల్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement