Friday, April 19, 2024

టీకా వేయించుకున్నా రాష్ర్ట ఎన్నికల సంఘం కమిషనర్ పార్థసారథికి కరోనా

హైదరాబాద్ : తెలంగాణ రాష్ర్ట ఎన్నికల సంఘం కమిషనర్ పార్థసారథికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. గత నెలలో నిమ్స్ ఆస్పత్రిలో కరోనా వ్యాక్సిన్ తొలి డోసు కూడా తీసుకున్నారు. అయినప్పటికీ ఆయనకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. గ‌త కొన్ని రోజులుగా కమిషనర్ పార్థసారథి జ్వరంతో బాధపడుతున్న ఆయన కరోనా టెస్టులు చేయించుకోగా ఈ ఫలితం పాజిటివ్ వ‌చ్చింది. దీంతో ఆయ‌న ఐసోలేష‌న్ లో ఉండి చికిత్స తీసుకుంటున్నారు… వారం రోజులుగా తనతో సన్నిహితంగా మెలిగిన వారంతా కరోనా పరీక్షలు నిర్వహించుకోవాలని ఆయ‌న కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement