Tuesday, May 7, 2024

RR : మోసాల భారాసకు గుణపాఠం చెపుదాం

తొమ్మిదిన్నర సంవత్సరాలలో చేయని అభివృద్ధి ఇప్పుడు అవకాశం చేస్తామని మోసపూరిత వాగ్దానాలు చేస్తున్న బారాసకు బుద్ధి చెప్పాలని షాద్ నగర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వీర్ల పల్లి శంకర్, మాజీ ఎమ్మెల్యే చల్లపల్లి ప్రతాప్‌రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. ఆదివారం మండలంలోని బైర్ ఖాన్ పల్లి , మంగళ గూడెం, కోనాయిపల్లి, సంతాపూర్ గ్రామాల్లో కాంగ్రెస్ అభ్యర్థి వీర్లపల్లి శంకర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

మోసాల బారాసను ఓటు ఆయుధంతో సాగనంపాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. భైర్ ఖాన్ పల్లి లో జడ్పిటిసి సభ్యురాలు విశాల ప్రసంగిస్తుండగా కొందరు తెరాస కార్యకర్తలు జై భారాస అనే వినాదాలతో అడ్డుకునే ప్రయత్నం చేశారు. అక్కడే ఉన్న మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి, వీరపల్లి శంకర్, శ్యాంసుందర్ రెడ్డి కలుగచేసుకొని ఇది పద్ధతి కాదంటూ హెచ్చరించారు. రాబోయే ఎన్నికలలో ఓటు ద్వారా గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement