Sunday, April 28, 2024

RR: అభివృద్ధి పథకాలే మళ్లీ బీఆర్ఎస్ ను గెలిపిస్తాయి.. ఎమ్మెల్యే అంజయ్య

షాద్ నగర్, అక్టోబర్ 24 (ప్రభ న్యూస్) : అభివృద్ధి పథకాలే మళ్లీ బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తాయని ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ తెలిపారు. బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యే అంజయ్య సమక్షంలో ఆయన క్యాంపు కార్యాలయంలో వివిధ గ్రామాల ప్రజలు స్వచ్ఛందంగా కాంగ్రెస్, బీజేపీలకు బాయ్ చెప్పి బీఆర్ఎస్ పార్టీలో చేరారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ మాట్లాడుతూ… ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై ప్రజలు బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారన్నారు. ఆసరా పింఛన్ పంపిణీ, రైతు బీమా పథకం, రైతు బంధు పథకం రూ.16,000 పెంపు, పేదలకు ఇళ్ల స్థలాలు, దివ్యాంగులకు 5000 పెన్షన్, గృహ అవసరాల కోసం 400 కే సిలిండర్, ప్రతి ఇంటికి బీమా, అగ్రవర్ణ పేదలకు రెసిడెన్షియల్ స్కూల్స్, అనేక రకాల సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నారన్నారు. నేడు పార్టీ కార్యాలయంలో
సిద్దాపూర్ మల్లాపూర్ అయ్యవారిపల్లి వెంకటరెడ్డి పల్లి బైరంపల్లి గ్రామాల ప్రజలు స్వచ్ఛందంగా పార్టీలో చేరారని ఆయన పేర్కొన్నారు. తమకు అన్ని విధాలా ఆదుకొని, తమ గ్రామాలన్నింటిని ఎంతో అభివృద్ధి పరిచి ఏ ఆపతి వచ్చినా.. నేనున్నా అంటూ ఆపదలో ఆదుకున్న అంజన్న మళ్లీ ఎమ్మెల్యే కావాలని వివిధ గ్రామాల ప్రజలు కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement