Wednesday, May 8, 2024

AP: టీడీపీ-జనసేన పొత్తుపై మంత్రి అంబటి సెటైర్లు..

టీడీపీ-జనసేన పార్టీల పొత్తుపై ఏపీ మంత్రి అంబటి రాంబాబు సెటైర్లు వేశారు. పొత్తులో భాగంగా తెలుగుదేశం పార్టీ, జనసేనల మధ్య పొత్తులో నిన్న కీలక ముందడుగు పడింది. టీడీపీ, జనసేన పార్టీల ఉమ్మడి సమన్వయ కమిటీ నిన్న (సోమవారం) రాజమండ్రిలో సమావేశం కావడం తెలిసిందే.

ఈ సమావేశానికి నారా లోకేశ్, పవన్ కల్యాణ్ కూడా హాజరయ్యారు. ఈ నేపథ్యంలో, ఏపీ మంత్రి అంబటి రాంబాబు సెటైర్లు విసిరారు. సూటుకేసు తీసుకో… లోకేశ్ తో కలిసిపో అంటూ పవన్, లోకేశ్ లు కలిసున్న ఫొటోను పంచుకున్నారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. మరో ట్వీట్ లో… సొంత కుమారుడు, అద్దె కుమారుడు ఇద్దరూ ఉత్తర కుమారులే అంటూ మంత్రి అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement