Sunday, April 28, 2024

TS : కారెక్కిన జ‌డ్పీటీసీ… గుర్తింపు లేదని ఆవేదన…

షాద్ నగర్, మార్చి 25 (ప్రభ న్యూస్) షాద్ నగర్ నియోజక వర్గంలోని కొందుర్గ్ మండల జ‌డ్పీటీసీ ఎదిరే రంగమ్మ కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసింది. ఇవాళ మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు సమక్షంలో బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకుంది. ఆమెకు హరీష్ రావు గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

తిరిగి సొంత పార్టీకి రావడం చాలా సంతోషంగా ఉందని రంగమ్మ అన్నారు. కాంగ్రెస్ పార్టీలో తనకు గుర్తింపు లేదని, ఆ పార్టీ విధానాలు సరిగ్గా లేవని అన్నారు. బిఆర్ఎస్‌లో చేరడంతో సొంత ఇంటికి వచ్చినట్టు ఉందని చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ విజయం కోసం కృషి చేస్తామని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement