Monday, May 6, 2024

Vikarabad: కన్యాలాల్ బాగ్ లో కాంగ్రెస్ ప్రచారం

వికారాబాద్, నవంబర్ 4 (ప్రభ న్యూస్): కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ మంత్రి ప్రసాద్ కుమార్ ను గెలిపించాలని కోరుతూ వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని 29వ వార్డు కన్యాలాల్ బాగ్ లో కాంగ్రెస్ పార్టీ ప్రచారం నిర్వహించింది.

వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ చిగులపల్లి మంజుల రమేష్ ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు నరోత్తం రెడ్డి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ చిగుళ్లపల్లి రమేష్, మాజీ గ్రంథాల సంస్థ చైర్మన్ గుడిసె లక్ష్మణ్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి, నాయకులు శ్రీనివాస్ ముదిరాజ్ మధు ప్రవీణ్ కుమార్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరుతూ ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్ కోఆర్డినేటర్ రఘుపతి రెడ్డి, చాపల శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement