Sunday, May 5, 2024

స్మగ్లింగ్ ముఠా అరెస్ట్ : రూ.70ల‌క్ష‌ల గంజాయి స్వాధీనం

కొత్తూరు: రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం కొత్తూరు మండలం తిమ్మాపూర్ వద్ద ఐదుగురు గంజాయి స్మగ్లర్లు పెద్ద ఎత్తున గంజాయితో పట్టుబడ్డారు. 70 లక్షల రూపాయల విలువైన గంజాయి స్వాధీనం చేసుకున్నారు. మూడు కార్లతో పాటు మొబైల్ ఫోన్లు, రూ.2.10లక్షల నగదును కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు కొత్తూరు పోలీస్ స్టేషన్లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శంషాబాద్ డీసీపీ జగదీశ్వర్ రెడ్డి వెల్లడించారు. షాద్ నగర్ ఏసీపీ కుశాల్కర్, కొత్తూరు పట్టణ సీఐ శ్రీధర్ భూపాల్, శంషాబాద్ ఎస్ఓటి వెంకట్ రెడ్డి, ఎస్ఐ రవి తదితరులు మీడియా సమావేశంలో పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement