Friday, May 17, 2024

మహిళపై దాడి

వికారాబాద్, జూన్ 7 (ప్రభ న్యూస్): వికారాబాద్ జిల్లా నవాబ్ పేట మండలం గంగ్యాడలో ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళపై మరో మహిళ దాడి చేసిన సంఘటన బుధవారం ఉదయం చోటు చేసుకుంది. గ్రామస్తులు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గంగ్యాడ గ్రామానికి చెందిన అమృతమ్మ(35) అనే వివాహితమైన పై అదే గ్రామానికి చెందిన రమాదేవి ఇంట్లో ఎవరు లేని సమయంలో రాళ్లతో కట్టెలతో దాడి చేసి తలపై తీవ్ర గాయాలు చేసింది. గాయాలు చేయడంతో పాటు పిల్లల్ని తనను చంపుతానని బెదిరించినట్టు అమృతమ్మ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. ఈ మేరకు నవాబ్ పేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement