Monday, April 29, 2024

భారీ వర్షాలకు నిండుకుండలా మారిన – అనంతగిరి పుష్కరిణి

వికారాబాద్ (ప్రభ న్యూస్) : గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వికారాబాద్ జిల్లాలోని అనంతగిరి శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయంలో గల పుష్కరిణి నిండుకుండలా మారింది. ఈనెల 13న ఆషాడ మాస చిన్న జాతర సందర్భంగా శ్రీ అనంత పద్మ స్వామి ఆలయంలో చినజాతర ఉత్సవాలు నిర్వహించనున్నారు. శనివారం సాయంత్రం ఆలయంలో ధ్వజారోహానతో ప్రారంభమైన ఈ చిన్న జాతర ఉత్సవాల సందర్భంగా ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున విచ్చేస్తున్నారు ఆలయం సమీపంలో గల పుష్కరిణి గతంలో ఎన్నడూ లేనివిధంగా పూర్తిగా నిండి నిండుకుండలా మారింది. నిండిన జలాలు పుష్కరణ నుండి అనతి అడవిలోకి వెళుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement