Friday, March 29, 2024

నిర్మాణ పనులు నాణ్యంగా ఉండాలి

పార్వతీపురం : సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పనులు నాణ్యతగా ఉండాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ తెలిపారు. శనివారం ఆయన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం పనులను తనిఖీ చేశారు. ఆసుపత్రి నిర్మాణం త్వరగా పూర్తిచేసి అప్పగించాలని అధికారులను అదేశించారు. నిర్మాణంలో నాణ్యమైన మెటీరియల్ వినియోగించాలన్నారు. ఆసుపత్రిలో రోగులకు చికిత్సతో పాటు చక్కని వసతులు, వాతావరణం కల్పించాలని తెలిపారు. ఆసుపత్రిలో పార్క్ కూడా నిర్మాణం చేయాలని అధికారులకు సూచించారు. నిర్మాణపనులలో జాప్యం ఉండకూడదని, ప్రతివారం రోజులకు ఒకసారి పనులు పురోగతిని తనిఖీ చేస్తానని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement